హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
సమావేశాలకు ముందు అమరవీరులకు నివాళులు అర్పించి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి వెళ్లనున్నారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలు, వివిధ స్కాంల అంశాలపై బీఆర్ఎస్ పార్టీ గళమెత్తనుంది. దీంతో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠభరితంగా జరిగే అవకాశం ఉంది.
-
అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ఆవిష్కరించారు.
అసెంబ్లీ ఆవరణలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Governor Shiv Pratap Shukla along with CM Revanth Reddy unveiled the statue of Telangana Thalli in the Assembly premises.#Telangana #TelanganaAssembly pic.twitter.com/8FjK1FUD5L
— Congress for Telangana (@Congress4TS) March 16, 2026
-
గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన
రైతులకు వెన్నుపోట్లు.. రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు” అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు.
అసెంబ్లీ సమావేశాలకు ముందు గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
రైతులకు వెన్నుపోట్లు.. రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు..
అంటూ గన్ పార్క్, అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. pic.twitter.com/6qGH8QDllQ— BRS Party (@BRSparty) March 16, 2026
-
పింక్ కలర్ షర్ట్స్ తో అసెంబ్లీకి హాజరుకానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
పింక్ కలర్ షర్ట్స్ తో అసెంబ్లీకి హాజరుకానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు@kp_vivekanand @KTR_News @drsanjayBRS pic.twitter.com/I7mbyWxfxQ
— Journalist Pandari (@Pandari_Journo) March 16, 2026
-
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ.
ఉదయం 11:27 నుండి 11:37 గంటల మధ్య గవర్నర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
కౌన్సిల్ భవనం ముందున్న పునరుద్ధరించిన ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
గవర్నర్ సంయుక్త సభను ఉద్దేశించి ప్రసంగం ముగిసిన తర్వాత శాసన మండలి, శాసనసభ సభ్యులు తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు.