టీటీడీ అన్నదాన పథకానికి 40 ఏళ్లు: ఎన్టీఆర్ సంకల్పం.. లక్కిశెట్టి వెంకటరామయ్య త్యాగం! తెరపైకి ఆసక్తికర చర్చ

టీటీడీ నిత్యాన్నదానం పథకం ప్రారంభమై 40 ఏళ్లు పూర్తి. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కృషిని కొనియాడగా.. ఈ పథకానికి పునాది వేసిన దాత లక్కిశెట్టి వెంకటరామయ్య పేరును మరువకూడదని బొలిశెట్టి సత్యనారాయణ గుర్తు చేశారు. ఆసక్తికర చర్చ వివరాలు ఇక్కడ...

Tirumala Nitya Annadanam Scheme

Tirumala Nitya Annadanam Scheme తిరుమల/అమరావతి: కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తుల ఆకలి తీరుస్తున్న ‘శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదానం’ పథకం మరో మైలురాయిని అధిగమించింది. 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ పథకం నేటికి 40 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్ మరియు దానికి వచ్చిన కౌంటర్ రిప్లై ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

నాటి 2 వేల మంది నుంచి.. నేటి 2.80 లక్షల మందికి!

  • ముఖ్యమంత్రి తన పోస్ట్‌లో ఈ పథకం ప్రస్థానాన్ని వివరించారు:
  • ప్రారంభం: 1985లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) గారు కేవలం 2 వేల మందితో ఈ పథకాన్ని ప్రారంభించారు.
  • ప్రస్తుత స్థితి: నేడు రోజుకు సగటున 2.80 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందుతోంది.
  • మూలనిధి: భక్తుల విరాళాలతో అన్నప్రసాదం ట్రస్ట్ మూలనిధి రూ. 2,500 కోట్లు దాటింది.
  • దీని స్ఫూర్తితోనే టీటీడీ ద్వారా ప్రాణదానం, విద్యాదానం వంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

తెరపైకి ‘లక్కిశెట్టి వెంకటరామయ్య’ పేరు.. అసలు చరిత్ర ఇదేనా?

సీఎం చంద్రబాబు నాయుడు కేవలం ఎన్టీఆర్ గారి పేరునే ప్రస్తావించడంపై జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ఈ పథకం వెనుక ఉన్న అసలైన దాతను మరువకూడదని ఆయన గుర్తు చేశారు.

TTD Nitya Annadanam TTD Annaprasadam Trust Ramaiah first donor to TTD Annadanam Tirumala Nitya Annadanam Scheme

అంకురార్పణ: 1985లో భక్తుల కష్టాలు చూసి చలించిన లక్కిశెట్టి వెంకటరామయ్య (L.V. Ramaiah) గారు, కంచి స్వామివారి ఆశీస్సులతో ఈ పథకాన్ని రూపకల్పన చేశారు.

తొలి విరాళం: ఈ పథకం ప్రారంభం కావడానికి ఆనాడే ఆయన తన సొంత సొమ్ము రూ. 10 లక్షలు (నేటి విలువ ప్రకారం సుమారు రూ. 8 కోట్లు) తొలి విరాళంగా ఇచ్చి ఎన్టీఆర్ గారిని ఒప్పించారు.

నేటి డిమాండ్: వ్యవస్థను నడిపిన పాలకులను గౌరవిస్తూనే, దానికి పునాది వేసిన దాత చరిత్రను మరుగున పరచడం సరికాదని, ఇప్పటికైనా లక్కిశెట్టి వెంకటరామయ్య సేవలను ప్రభుత్వం గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాజకీయంగా ఎవరు క్రెడిట్ తీసుకున్నా.. ఒక గొప్ప సంకల్పం వెనుక దాతల త్యాగం, పాలకుల పట్టుదల ఉంటే అది ఎన్ని తరాలకైనా ఆదర్శంగా నిలుస్తుందని టీటీడీ అన్నదాన పథకం నిరూపిస్తోంది. కోట్లాది మంది భక్తుల ఆకలి తీరుస్తున్న ఈ పథకం వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ స్మరించుకోవడమే నిజమైన నివాళి.

Also Read: శాతంకుళం కేసులో అసలైన హీరో ‘రేవతి’: వ్యవస్థను ఎదిరించి.. నిజాన్ని గెలిపించిన ధైర్యశాలి!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »