విశాఖపట్నం భవిష్యత్ అభివృద్ధికి బ్లూప్రింట్గా Visakhapatnam Metropolitan Region Development Authority (VMRDA) 2041 మాస్టర్ప్లాన్లో కీలక మార్పులను ప్రతిపాదించింది. నగర విస్తరణ, పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జోన్లను రూపొందించింది.
ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి?
- తగరాపువలస – నివాస, వాణిజ్య, విద్యా సంస్థల అభివృద్ధి
- ఆనందపురం – టెక్నాలజీ & డేటా సెంటర్ పార్కులు
- మేఘాద్రి గెడ్డ – సరస్సు అభివృద్ధి, వినోద కేంద్రాలు
- రవాడ – గృహ నిర్మాణ, రెసిడెన్షియల్ జోన్
- భోగాపురం – ఫైనాన్స్, ఐటీ, టూరిజం, బిజినెస్ & కమర్షియల్ హబ్
- మధురవాడ – రెసిడెన్షియల్, ఐటీ & ITeS విస్తరణ
- హనుమంతవాక – మెడిసిటీ (వైద్య సేవల క్లస్టర్)
- నరవ – మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్టేషన్ హబ్
విశాఖపట్నం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక కేంద్రంగా ఎదుగుతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్, ఐటీ విస్తరణ, పోర్ట్ ఆధారిత పరిశ్రమలతో నగర ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ మాస్టర్ప్లాన్ ద్వారా ప్రాంతాల వారీగా అభివృద్ధి చేయడం వల్ల రద్దీ తగ్గి సమతుల్య వృద్ధి సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జైల్లో ప్రత్యేక సదుపాయాలు… గుంటూరు కోర్టు ఆదేశాలు ఎందుకు కీలకం?
మెడిసిటీ, టెక్నాలజీ పార్కులు, ఫైనాన్షియల్ హబ్లతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం లభించే అవకాశం ఉంది. అలాగే మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్తో రైలు, రోడ్డు, విమాన కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుంది.
2041 నాటికి విశాఖను అంతర్జాతీయ ప్రమాణాల మెట్రో నగరంగా తీర్చిదిద్దడమే VMRDA లక్ష్యంగా కనిపిస్తోంది.