- ఇండియా-అమెరికా కనెక్ట్ AI కనెక్టివిటీ ప్రాజెక్ట్ ప్రకటన
- సముద్రగర్భ కేబుల్స్ ద్వారా డేటా వేగం పెంపు
- Google AI ప్రొఫెషనల్ సర్టిఫికేట్ స్కిల్స్ ప్రోగ్రామ్ ప్రారంభం
ఢిల్లీలో గూగుల్ కీలక ప్రకటన
ఢిల్లీలో జరిగిన గూగుల్ కార్యక్రమంలో సీఈఓ సుందర్ పిచాయ్ కీలక నిర్ణయాలను వెల్లడించారు. భారత్-అమెరికా మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్టివిటీ పెంచేందుకు “ఇండియా-అమెరికా కనెక్ట్ ఇనిషియేటివ్”ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
సముద్రగర్భ కేబుల్స్తో వేగవంతమైన డేటా
ఈ ప్రాజెక్ట్లో భాగంగా కొత్త సబ్-సీ కేబుల్ మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి భారత్, అమెరికా తో పాటు దక్షిణ గోళార్థంలోని పలు ప్రాంతాల మధ్య డేటా మార్పిడిని వేగవంతం చేస్తాయి. AI సేవలు మరింత వేగంగా అందుబాటులోకి రావడానికి ఇది దోహదం చేయనుంది.
స్కిల్స్ అభివృద్ధిపై దృష్టి
టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే నైపుణ్యాల అభివృద్ధి అవసరమని పిచాయ్ పేర్కొన్నారు. అందుకే గూగుల్ ఇప్పటివరకు చేపట్టిన వాటిలోనే అతిపెద్ద స్కిలింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
కొత్త AI సర్టిఫికేట్ కోర్సు
ఈ కార్యక్రమంలో భాగంగా “Google AI Professional Certificate” పేరుతో కొత్త కోర్సును ప్రారంభిస్తున్నారు. ఉద్యోగాల్లో AI వినియోగం నేర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని గూగుల్ తెలిపింది.