సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం ఉదయం కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. KITS Women Engineering College భవనంపై నుంచి బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బి. మైను (21) దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, ఫోన్లో మాట్లాడుకుంటూనే అకస్మాత్తుగా భవనం పై నుంచి కిందకు దూకినట్లు చెబుతున్నారు. ఘటనతో ఒక్కసారిగా కాలేజీ ప్రాంగణం గందరగోళంగా మారింది.
తీవ్ర గాయాలపాలైన విద్యార్థినిని కాలేజీ యాజమాన్యం వెంటనే సమీప ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బాధితురాలు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో కాలేజీ విద్యార్థుల్లో భయం నెలకొంది.
- హాస్టల్ భద్రతపై ప్రశ్నలు
- మానసిక ఒత్తిడి కారణమా అన్న అనుమానాలు
- తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన
కోదాడ ప్రాంతంలో ఈ వార్త వేగంగా వ్యాపించడంతో కాలేజీ వద్దకు స్థానికులు, విద్యార్థుల బంధువులు చేరుకుంటున్నారు.
“అమ్మాయి చాలా నిశ్శబ్దంగా ఉండేది. ఏం జరిగింది అనేది మాకు అర్థం కావడం లేదు. కాలేజీ లో కౌన్సెలింగ్ సపోర్ట్ అవసరం ఉంది.” ఒక విద్యార్థి తెలిపాడు
పోలీసులు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
- ఫోన్ కాల్ వివరాలు
- స్నేహితులు, సహ విద్యార్థుల వాంగ్మూలాలు
- వ్యక్తిగత సమస్యల కోణం అన్నింటినీ పరిశీలిస్తున్నారు.
ఇటీవల తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యాయత్నాల కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
Also Read: కొండగట్టులో అవ్యవస్థలు బహిర్గతం – పందిరి ప్రమాదం, లడ్డూ కొరతతో భక్తుల నిరసన


