హైదరాబాద్ నగరంలో కేఫ్ పేరిట నడుస్తున్న అక్రమ హుక్కా కేంద్రాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో అర్ధరాత్రి నిర్వహించిన మెరుపుదాడిలో మొత్తం 38 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 35 మంది కస్టమర్లు, 4 మంది హుక్కా సరఫరాదారులు ఉన్నారు.
ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, ‘ది వైట్ కప్’ అనే కేఫ్ పేరుతో అనుమతి తీసుకుని, అదే ప్రాంగణంలో గుప్తంగా హుక్కా సెంటర్ నడుపుతున్నట్లు సమాచారం అందడంతో దాడి నిర్వహించారు. తనిఖీల్లో హుక్కా ఫ్లేవర్స్, పరికరాలు, 36 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేంద్రంలో ఒక్కొక్కరికి రూ.800 నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కేఫ్ నిర్వహకులు మోహన్, సాగర్ కలిసి ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. అయితే దాడి సమయంలో వారు పరారీలో ఉండటంతో, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
#WATCH | Rangareddy, Telangana: LB Nagar police conducted a raid on a hookah centre, disguised as a cafe, in Rajiv Gandhi Nagar late last night. 35 customers and 4 suppliers were caught, and 36 phones and hookah pots were seized during the raid. pic.twitter.com/i1KunM4GZ0
— ANI (@ANI) March 17, 2026
ఈ ఘటన నగరంలో పెరుగుతున్న అక్రమ హుక్కా కేంద్రాలపై మరోసారి దృష్టి సారించింది. ఇటీవల కాలంలో యువతను లక్ష్యంగా చేసుకుని కేఫ్లు, రెస్టారెంట్ల పేరుతో ఇలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నారు.
హుక్కా వినియోగం ఆరోగ్యపరంగా హానికరమే కాకుండా, అనుమతి లేకుండా నిర్వహించడం చట్టవిరుద్ధం. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
పోలీసులు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని కేఫ్లు, రెస్టారెంట్లు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అన్నదానిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.
Also read: పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు… పార్టీ నుంచి తాత్కాలిక సస్పెన్షన్