అమరావతి/విజయవాడ: విజయవాడ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ఆర్టీసీ భూములను ‘లులూ మాల్’ (Lulu Mall) కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రూ. 400 కోట్ల విలువైన ఈ భూములను లీజుకు ఇచ్చే ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లు కూటమి ప్రభుత్వం తరపు న్యాయవాది (ఏజీ) కోర్టుకు వెల్లడించారు.
అసలు ఏం జరిగింది?
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఉన్న విలువైన భూమిని ఎటువంటి టెండర్లు లేకుండా, అత్యల్ప ధరకే (ఏడాదికి రూ. 2 కోట్లు) 99 ఏళ్ల పాటు లులూ గ్రూప్నకు లీజుకు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సామాజిక కార్యకర్తలు వడ్డే శోభనాద్రీశ్వరరావు, అడ్వకేట్లు సి.హెచ్. వెంకటేశ్వరరావు, పాకాల సత్యనారాయణలు హైకోర్టులో పిల్ (PIL) దాఖలు చేశారు.
కోర్టులో ప్రభుత్వం యూటర్న్:
ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కీలక సమాచారం అందించారు.
లీజు రద్దు: ఆర్టీసీ భూములను లులూ మాల్కు ఇచ్చే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుందని తెలిపారు.
కారణాలు: ఈ కేటాయింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ప్రతిపక్షాలు మరియు ప్రజా సంఘాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ రగడ: సోషల్ మీడియాలో విమర్శల వర్షం
ప్రభుత్వ నిర్ణయంపై నెటిజన్లు మరియు ప్రతిపక్ష మద్దతుదారులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
“జగన్ విజయం”: గతంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టిన వారు, ఇప్పుడు అదే బాటలో నడుస్తూ భూములను వెనక్కి తీసుకోవడం వైసీపీ నైతిక విజయమని కొందరు వాదిస్తున్నారు.
“తరిమేశారా.. వెనక్కి తగ్గారా?”: గతంలో లులూ సంస్థ రాకపోతే రాష్ట్రానికే నష్టమని ఊదరగొట్టిన నేతలు, ఇప్పుడు కోర్టు భయంతోనో లేక అక్రమాలు బయటపడతాయనే కారణంతోనే వెనక్కి తగ్గారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టెండర్ల గోల: ఎటువంటి పారదర్శకత లేకుండా భూములను అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం విఫలమైందని ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Also read : NH-44 Big Update: Hyderabad–Bangalore హైవేకు ₹57.42 కోట్లు… APలో భారీ రీన్యువల్ పనులు
విద్య, వివాహానికి ఆర్థిక చేయూత – మార్చి 8న కొత్త పథకాల ప్రారంభం


