ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) శుభవార్త చెప్పింది. జూన్ 29, 2026న గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుగొండలో జాబ్ మేళా నిర్వహించనుంది. ఈ జాబ్ మేళాలో 10 ప్రముఖ కంపెనీలు పాల్గొనగా, 400కిపైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ముందుగానే ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
పాల్గొనే కంపెనీలు
- శ్రీ వెన్నెల హెర్బల్ బ్యూటీ కేర్
- రిస్క్ గార్డ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్
- భావ్య హెల్త్ సర్వీసెస్
- శ్రీ స్వర్ణికా మోటార్స్
- ఎస్పీ క్యాపిటల్ సర్వీసెస్
- మాస్టర్ మైండ్స్
- విజన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
- క్యూఎస్ కార్ప్ లిమిటెడ్
- జేసీబీ (JCB)
- భారత్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ లిమిటెడ్
అందుబాటులో ఉన్న ఉద్యోగాలు
ఈ జాబ్ మేళాలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వాటిలో ముఖ్యంగా:
- బ్యూటీషియన్
- సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్
- టెలికాలర్
- ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్
- డిస్ట్రిక్ట్ మేనేజర్
- కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్
- సేల్స్ ఎగ్జిక్యూటివ్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్
- ఎలక్ట్రీషియన్
- సర్వీస్ ఇంజనీర్ / ట్రైనీ
- లోన్ ఫీల్డ్ అసిస్టెంట్
అర్హతలు
SSC, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ వంటి అర్హతలు ఉన్న అభ్యర్థులు పోస్టుల వారీగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్తో పాటు అనుభవం ఉన్న వారికి కూడా అవకాశాలు ఉన్నాయి.
జీతం
పోస్టును బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభించనుంది. కొన్ని పోస్టులకు ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్స్) కూడా అందించనున్నారు.
జాబ్ మేళా వివరాలు
- తేదీ: 29 జూన్ 2026
- సమయం: ఉదయం 10 గంటల నుంచి
- వేదిక: నీరుగొండ, మంగళగిరి మండలం, CRDA ప్రాంతం
- నమోదు: naipunyam.ap.gov.in
- సంప్రదించవచ్చు: 99634 25999, 99888 53335
అభ్యర్థులకు సూచనలు
అభ్యర్థులు తమ రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు వెంట తీసుకురావాలి. అలాగే ఫార్మల్ డ్రెస్లో హాజరుకావాలని APSSDC సూచించింది.

