హైదరాబాద్: సామాన్యుడికి బంగారం కల ‘అందనంత’ ఎత్తుకు చేరుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో, పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా దేశీయంగా పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజూ ధరలు పెరగడంతో, గత మూడు రోజుల్లోనే తులం బంగారంపై దాదాపు రూ. 5,000 వరకు భారం పడటం గమనార్హం. మరో వారంలో వివాహాల సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో, ఈ ధరల పెరుగుదల సామాన్య మధ్యతరగతి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఫిబ్రవరి 11, బుధవారం నాటి తాజా ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్లో బంగారం ధరలు:
- నగర బులియన్ మార్కెట్లో నేడు 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి.
- 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాములపై రూ. 800 పెరిగి.. రూ. 1,45,550 వద్దకు చేరింది.
- 24 క్యారెట్ల (మేలిమి) బంగారం: 10 గ్రాములపై రూ. 870 పెరిగి.. రూ. 1,58,780 కు పెరిగింది.
వెండి ధర :
బంగారం రేట్లు పెరిగినప్పటికీ, వెండి ధర నేడు స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 3,00,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర తగ్గుముఖం పట్టడంతో, రానున్న రోజుల్లో దేశీయంగానూ తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్ అప్డేట్:
- దేశీయంగా పెరుగుతున్నా, గ్లోబల్ మార్కెట్లో మాత్రం నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది.
- స్పాట్ గోల్డ్: ఔన్సుకు 17 డాలర్లు తగ్గి 5,038 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
- స్పాట్ సిల్వర్: 1.20% తగ్గి 81.55 డాలర్ల వద్దకు చేరుకుంది.