తీవ్ర విషాదం.. సీనియర్ నేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నేత అజిత్ పవార్ (66) ఒక ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌ ప్రయత్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం అదుపు తప్పి కుప్పకూలింది.

Ajit Pawar dies in plane crash

మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీనియర్ నేత అజిత్ పవార్ (66) ఒక ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్‌ ప్రయత్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం అదుపు తప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు విమానంలో ఉన్న మరొక ఆరుగురు కూడా ప్రాణాలు కోల్పోయారని ప్రాథమిక సమాచారం అందింది. అయితే, అధికారికంగా మృతుల సంఖ్య నలుగురు మాత్రమే అని అధికారులు ప్రకటించారు. ఈ హఠాత్పరిణామంతో దేశవ్యాప్తంగా ప్రజలలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యాపించింది.

అజిత్ పవార్ ముంబయి నుంచి తన సొంత నియోజకవర్గం బారామతికి బయలుదేరారు. బుధవారం ఆయన బారామతిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మూడు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉంది. విమానం బారామతి రన్‌వేవ్‌పై ల్యాండ్ అవ్వడానికి ప్రయత్నించిన సమయంలో అకస్మాత్తుగా అదుపు తప్పి నేలపై కుప్పకూలింది. దాంతో విమానం మంటల్లో కాలింది. సమాచారం అందగానే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆగమనం, రక్షణా చర్యలు చేపట్టాయి. ప్రాథమికంగా మృతులు, గాయపడిన వారిని గుర్తించి, పరిస్థితిని స్థిరీకరించడం కోసం చర్యలు తీసుకున్నారు.

⇒ భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రక వాణిజ్య ఒప్పందం.. త‌గ్గ‌నున్న మ‌ద్యం ధ‌ర‌లు

ప్రమాదంలో కీలక అంశాలు:

మృతులు: అజిత్ పవార్ మరియు మరో ముగ్గురు (అధికారికంగా)

సమయం: బుధవారం ఉదయం, ల్యాండింగ్ ప్రయత్న సమయంలో

స్థలం: బారామతి విమానాశ్రయం, మహారాష్ట్ర

ఎన్నికల ప్రచారానికి బయల్దేరిన క్రమంలో ప్ర‌మాదం.

విమానం అదుపు తప్పి నేలపై కుప్పకూల‌డం, వెంటనే మంటలు చెలరేగాయి

ఈ ప్రమాదం తరువాత, రాష్ట్ర మరియు కేంద్ర రాజకీయ నేతలు, పార్టీలలో తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రజలు కూడా ఈ ఘటనపై విపరీతంగా బాధతో ఉన్నారు. సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అజిత్ పవార్ అనేక రాజకీయ రంగాల్లో అనుభ‌వం కలిగిన వ్యక్తి కావడంతో, ఈ ప్రమాదం రాజకీయ వర్గాల్లో దిగ్భ్రాంతి క‌లిగించింది.

ఏం జ‌రిగింది..

అజిత్ పవార్ తన భద్రతా సిబ్బందితో కలిసి ముంబై నుంచి లియర్ జెట్ 45 అనే ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో బయలుదేరారు.

ఉదయం 8:48 గంటల ప్రాంతంలో బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ కావాలి.

ఆ సమయంలో విమానం రన్‌వే పక్కకు దూసుకెళ్లి ఒక్కసారిగా పేలిపోయింది.

మంటలు భారీగా ఎగిసిపడటంతో విమానం పూర్తిగా ధ్వంసమైంది.

బారామతి ఎయిర్‌పోర్ట్ మేనేజర్ శివాజీ తవారే ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది

విమానం ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయి రన్‌వే పక్కకు వెళ్లిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానం ముక్కలై మంటలు అంటుకున్నాయి అని ధృవీక‌రించారు.

అజిత్ పవార్ బారామతి ఎమ్మెల్యేగా ఉండగా, ఈ ప్రాంతం పవార్ కుటుంబానికి రాజకీయంగా కంచుకోటగా పేరుంది. జిల్లాపరిషత్ ఎన్నికల నేపథ్యంలో బారామతిలో అజిత్ పవార్ పర్యటనకు వచ్చారని, ఈ క్రమంలోనే గోజుబావి ప్రాంతంలో విమానం దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »