భారతదేశం గర్వపడే బిర్యానీ వైవిధ్యానికి నిదర్శనంగా నిలిచిన ‘వన్చెఫ్ బిర్యానీ ప్రీమియర్ లీగ్’ సందడి హైదరాబాద్లోని విజయ్ సేల్స్లో నిర్వహించిన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. గృహోపకరణాల తయారీ సంస్థ ‘వర్సుని ఇండియా’ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు నగరంలోని ఆహార ప్రియులు, కంటెంట్ క్రియేటర్లు , ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ ముగింపు వేడుకలో స్టార్ చెఫ్ రణవీర్ బ్రార్ , నటి తేజస్వి మదివాడ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఆన్లైన్ ఓటింగ్లో అత్యధిక ఓట్లు సాధించి, ‘ఇండియాస్ ఫేవరెట్ బిర్యానీ’గా హైదరాబాద్ బిర్యానీ నిలిచినట్లు వారు ప్రకటించారు.
ఈ లీగ్ ద్వారా హైదరాబాద్, అవధి, కోల్కతా, బాంబే వంటి వివిధ ప్రాంతాలకు చెందిన బిర్యానీ వంటకాలపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని, ఆరోగ్యకరమైన పోటీని మనం చూడగలిగాము. బిర్యానీ వంటి కష్టమైన వంటకాలను సైతం వన్చెఫ్ పరికరంతో ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చని, లైవ్ డెమోల ద్వారా చెఫ్ రణవీర్ బ్రార్ సభికులకు వివరించారు. ఈ సందర్భంగా వర్సుని ఇండియా మార్కెటింగ్ హెడ్ పూజా బైడ్ మాట్లాడుతూ, భారతీయుల ఆహార అలవాట్లతో ఉన్న భావోద్వేగ బంధాన్ని గౌరవిస్తూ, వంటింటి అవసరాలకు తగ్గట్టుగా మరిన్ని నూతన ఆవిష్కరణలను తీసుకువస్తామని వెల్లడించారు.