మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేస్తాం-జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి సాగర్ ( R K నాయుడు)

పెద్దపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేస్తామని సాగర్ (ఆర్‌కే నాయుడు) తెలిపారు. 150 మంది పార్టీలో చేరారు.

Janasena Party meeting in Peddapalli ahead of municipal elections led by Sagar RK Naidu
  • పెద్దపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తుందని సాగర్ ధీమా

  • సుమారు 150 మంది కొత్త కార్యకర్తలు జనసేన పార్టీలో చేరిక

  • తెలంగాణలో జనసేన జెండా ఎగురవేస్తామని పార్టీ నేతల ప్రకటన

పెద్దపల్లి లో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయమని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి సాగర్ అన్నారు.పెద్దపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మూల హరీష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, నాయకులు,వీర మహిళల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు,యువకులు,వీర మహిళలు సుమారు 150 మంది పార్టీ లో చేరినట్లు ఆయన తెలిపారు.పార్టీ లో చేరిన వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన జెండా ఎగురవేసి ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు.పార్టీ లో కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గం సీనియర్ నాయకులు పోలోజు విశ్వజ్ఞ చారి,రాచూరి హరి,మెరుగు నరేష్, నవీన్ జవ్వాజి నాయకులు,కార్యకర్తలతో పాటు వీర మహిళలు పాల్గొన్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »