హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) 2026 వార్షిక పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12న విడుదల చేయనుంది. విద్యాశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.
ముఖ్య వివరాలు:
ఫలితాల తేదీ: ఏప్రిల్ 12, 2026.
పరీక్షలు జరిగిన తేదీలు: ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు.
విద్యార్థుల సంఖ్య: మొత్తం 9,97,075 మంది విద్యార్థులు (ప్రథమ సంవత్సరం: 4,89,126; ద్వితీయ సంవత్సరం: 5,07,949).
కేంద్రాలు: రాష్ట్రవ్యాప్తంగా 1,495 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
వాట్సాప్లో మీ ఇంటర్ రిజల్ట్ ఎలా పొందాలి?
- మీ ఫోన్ కాంటాక్ట్స్లో 8096958096 నంబర్ను “MeeSeva Telangana” గా సేవ్ చేసుకోండి.
- వాట్సాప్ (WhatsApp) ఓపెన్ చేసి “Hi” అని మెసేజ్ పంపండి.
- “BIE Exam Result” అని టైప్ చేసి సర్వీస్ను ఎంచుకోండి.
ఫలితాలు ఎలా చూసుకోవాలి?
ముఖ్యమంత్రి ఫలితాలను ప్రకటించిన వెంటనే, విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో అధికారిక వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
ఖచ్చితత్వం కోసం ప్రత్యేక చర్యలు:
గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో, ఇంటర్ బోర్డు ఈసారి అత్యంత జాగ్రత్తలు తీసుకుంది:
స్పాట్ వాల్యుయేషన్: 20 కేంద్రాల్లో సుమారు 56 లక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది.
రీ-వెరిఫికేషన్: సున్నా మార్కులు వచ్చిన వారిపై మరియు నిర్దిష్ట స్లాబ్ మార్కులు (0-10, 25-35, 50-60, 90-100) సాధించిన విద్యార్థుల పేపర్లను అధికారులు మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు. దీనివల్ల రిజల్ట్స్లో తప్పులు లేకుండా పారదర్శకత పెరుగుతుందని బోర్డు భావిస్తోంది.
Also Read : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం… 9.97 లక్షల మంది విద్యార్థులు హాజరు
రైతు భరోసా డబ్బులు ఎక్కడ? రాజకీయ వాదోపవాదాలు
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి .. సీఎం రేవంత్కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ


