అమరావతిలో హెరిటేజ్ స్కామ్? భీమా ఇన్‌ఫ్రాపై వైసీపీ ఆరోపణలు

అమరావతి జీఏడీ టవర్ పనుల్లో చంద్రబాబు క్విడ్ ప్రో కోకు పాల్పడుతున్నారని వైసీపీ ఆరోపించింది. హెరిటేజ్ ప్లాంట్ కనెక్షన్‌పై పూర్తి వివరాలు మీ మన వార్తలో.

YSRCP social media post alleging connection between Heritage Foods construction and Amaravati GAD tower project contracts
YSRCP social media post alleging connection between Heritage Foods construction and Amaravati GAD tower project contracts

అమరావతి: రాజధాని అమరావతి పనుల్లో భారీ అవినీతి జరుగుతోందని, చంద్రబాబు నాయుడు తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods) కోసం పనులు చేసిన కంపెనీలకే ప్రభుత్వ కాంట్రాక్టులను కట్టబెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. హైదరాబాద్‌లోని షామీర్‌పేటలో హెరిటేజ్ ఐస్‌క్రీం ప్లాంట్‌ను నిర్మించిన భీమా ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ (Bhima Infra Solutions) కంపెనీకే, ఇప్పుడు అమరావతిలో ప్రతిష్టాత్మకమైన జీఏడీ (GAD) టవర్ పనులను సబ్‌-కాంట్రాక్ట్ రూపంలో అప్పగించారని వైసిపి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది.

వైఎస్సార్‌సీపీ లేవనెత్తిన ప్రధానాంశాలు:

1. పరస్పర లబ్ధి సూత్రం?

“నీకు అది.. నాకు ఇది” అనే సూత్రంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ విమర్శించింది.

హెరిటేజ్ ఫుడ్స్ కోసం షామీర్‌పేట్‌లో ఆధునిక టెక్నాలజీతో ప్లాంట్ నిర్మించిన ట్రాక్ రికార్డు ఉండటమే, ప్రభుత్వ ప్రాజెక్టులకు పాస్‌పోర్ట్‌గా మారిందా? అని ప్రశ్నించింది. ఇది ముందే నిర్ణయించిన “డీల్” అని ఆరోపించింది.

Also Read : అమరావతి పై జగన్ ఫైర్.. సోషల్ మీడియాలో భారీ రియాక్షన్!

2. అమరావతి జీఏడీ (GAD) టవర్ విశేషాలు: 

అమరావతిలో నిర్మిస్తున్న ఈ టవర్ భారతదేశంలోనే తొలి ఆధునిక డయాగ్రిడ్ స్ట్రక్చరల్ స్టీల్ సిస్టమ్ భవనంగా గుర్తింపు పొందుతోంది.

ఎత్తు: 218 మీటర్లు (49 అంతస్తులు).

విశేషం: 21,000 మెట్రిక్ టన్నుల స్టీల్‌తో సుమారు 1.04 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్టును భీమా ఇన్‌ఫ్రా కంపెనీయే చేపట్టిందని వైసిపి పేర్కొంది.

Also Read : అమరావతి–విజయవాడ Ropeway కారిడార్: కృష్ణా నది పై గగన మార్గానికి శ్రీకారం

3. షామీర్‌పేట్ హెరిటేజ్ ప్లాంట్ కనెక్షన్:

తెలంగాణలోని షామీర్‌పేట్ వద్ద హెరిటేజ్ ఫుడ్స్ ఐస్‌క్రీమ్ ప్లాంట్ నిర్మాణాన్ని భీమా ఇన్‌ఫ్రా విజయవంతంగా పూర్తి చేసింది.

6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రి-ఇంజినీర్డ్ బిల్డింగ్ (PEB) టెక్నాలజీతో ఈ ప్లాంట్ నిర్మించబడింది.

రాజకీయ విమర్శలు:

“ఇందులో మర్మం ఏంది బాబుగారూ..? ఇందులో మతలబు ఏంటి లోకేశా?” అంటూ వైఎస్సార్‌సీపీ నేరుగా ముఖ్యమంత్రి మరియు ఐటీ మంత్రిపై దాడికి దిగింది. అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు తన అనుచరులకు మరియు తన వ్యాపార భాగస్వాములకు మేలు చేస్తున్నారని ఆరోపించింది.

Also Read : చరిత్ర సృష్టించనున్న అమరావతి.. తొలిసారిగా రాజధానిలో రిపబ్లిక్ డే వేడుకలు

About Author: