హైదరాబాద్: ప్రపంచ రాజకీయ పరిణామాల ప్రభావం పసిడి మార్కెట్పై భారీగా పడింది. ట్రంప్ చేసిన యుద్ధ ముగింపు ప్రకటనలు, చమురు ధరల తగ్గుదల కారణంగా బంగారం, వెండి రేట్లు ఒక్కసారిగా (Gold and Silver Price)పెరిగాయి. కేవలం ఒక్కరోజులోనే వేలల్లో ధరలు పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నేటి బంగారం ధరల పరిస్థితి (ఏప్రిల్ 2-Gold and Silver Price):
హైదరాబాద్తో పాటు దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లోనే తులం బంగారంపై దాదాపు రూ. 9 వేల వరకు పెరుగుదల కనిపించింది.
22 క్యారెట్ల బంగారం: ఒక్కరోజులోనే రూ. 3,150 పెరగడంతో, ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ. 1,40,200 కు చేరుకుంది. మార్చి నెలలో కనిష్ట స్థాయి (రూ. 1.24 లక్షలు) నుండి చూస్తే ఇది భారీ పెరుగుదల.
24 క్యారెట్ల బంగారం: శుద్ధమైన బంగారం ధర రూ. 3,440 పెరిగి, ప్రస్తుతం 10 గ్రాములు రూ. 1,52,950 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరల పరుగు:
బంగారం బాటలోనే వెండి కూడా భారీ ఎగబాకింది. ఒక్కరోజులోనే కిలో వెండిపై ఏకంగా రూ. 15,000 పెరిగింది. దీనితో హైదరాబాద్లో కిలో వెండి ధర రూ. 2.65 లక్షల మార్కును తాకింది.
ధరలు పెరగడాని(Gold and Silver Price)కి ప్రధాన కారణాలు:
యుద్ధ ముగింపు సంకేతాలు: ఇరాన్పై వ్యూహాత్మక విజయం సాధించామని, మరో మూడు రోజుల్లో యుద్ధం ముగుస్తుందని ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్ ఆలోచనను మార్చేసింది.
క్రూడాయిల్ ఎఫెక్ట్: బ్యారెల్ ముడిచమురు ధర 115 డాలర్ల నుంచి 100 డాలర్ల స్థాయికి పడిపోవడంతో, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం, వెండి వైపు మళ్లిస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్: గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,700 డాలర్ల పైనే పలుకుతోంది. వెండి కూడా 73 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.
రూపాయి విలువ: అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ప్రస్తుతం రూ. 93.45 వద్ద ఉంది.
వివాహాల సీజన్ సమీపిస్తున్న వేళ ఈ ధరల పెరుగుదల సామాన్యులపై భారంగా మారనుంది. గత వారం రోజులుగా ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకులు యుద్ధం అధికారికంగా ముగిసే వరకు కొనసాగే అవకాశం ఉంది.
Also Read: జీఎస్టీ వసూళ్లలో రికార్డు.. తొలిసారి రూ.2 లక్షల కోట్ల మైలురాయి

