దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న PM Kisan 22nd Installment పై కీలక పరిణామం చోటుచేసుకుంది. 22వ వాయిదా విడుదలకు ముందే కేంద్ర ప్రభుత్వం వెరిఫికేషన్ ప్రక్రియను కఠినతరం చేసి లక్షలాది మంది అనర్హులైన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో 22వ విడత రూ. 2,000 మీ ఖాతాలో జమ కావాలంటే తప్పనిసరిగా కొన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
పీఎం కిసాన్ 22వ వాయిదా ఎప్పుడు?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి ఏడాది అర్హత గల రైతులకు రూ. 6,000 ఆర్థిక సాయం మూడు సమాన వాయిదాలలో అందిస్తున్నారు. ఒక్కో విడతకు రూ. 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. ఇప్పటివరకు 21 వాయిదాలు విడుదలయ్యాయి.
అయితే PM Kisan 22వ వాయిదా తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ, వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
ఎందుకు లక్షల పేర్లు తొలగించారు?
ఈసారి కేంద్ర ప్రభుత్వం డేటా మ్యాచింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను మరింత కఠినంగా అమలు చేస్తోంది. ముఖ్యంగా ఈ కారణాలతో అనేక మంది పేర్లు తొలగించినట్లు సమాచారం:
- రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు వివరాలు ఇవ్వడం
- ల్యాండ్ రికార్డులు పోర్టల్లో అప్డేట్ కాకపోవడం
- ఆదాయపు పన్ను చెల్లిస్తున్న రైతులు
- ఫిబ్రవరి 1, 2019 తర్వాత జరిగిన భూమి బదిలీలు
- e-KYC పూర్తి చేయకపోవడం
- ఆధార్-బ్యాంక్ ఖాతా లింక్ లేకపోవడం
ల్యాండ్ డాక్యుమెంట్లు మరియు పోర్టల్లో ఇచ్చిన సమాచారం సరిపోలకపోతే మీ వాయిదా నిలిచిపోవచ్చు.
- e-KYC & Land Seeding తప్పనిసరి
1. PM Kisan 22nd Installment పొందాలంటే e-KYC తప్పనిసరి. మీరు:
- ఆధార్ OTP ద్వారా
- బయోమెట్రిక్ ద్వారా (CSC సెంటర్లో)
- e-KYC పూర్తి చేయవచ్చు.
- మీ స్టేటస్లో e-KYC ‘Yes’ అని చూపకపోతే మీకు 22వ వాయిదా రాదు.
2.Land Seeding అప్డేట్ చేయాలి
- ల్యాండ్ సీడింగ్ అంటే మీ భూమి వివరాలను PM Kisan పోర్టల్లో సరైన విధంగా అప్డేట్ చేయడం.
- మీ స్టేటస్లో Land Seeding ‘No’ అని చూపిస్తే వెంటనే స్థానిక తహసీల్ కార్యాలయాన్ని సంప్రదించాలి.
3️. Aadhaar Seeding & Bank Linking
- మీ ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయి ఉండాలి. లేకపోతే డీబీటీ ద్వారా రూ. 2,000 జమ కావు.
- PM Kisan 22వ వాయిదా స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
- మీరు 22వ విడతకు అర్హులో కాదో మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు:
- అధికారిక వెబ్సైట్ 👉 pmkisan.gov.in విజిట్ చేయండి
- హోమ్పేజీలో ‘Farmer Corner’ సెక్షన్కి వెళ్లండి
- ‘Know Your Status’ ఆప్షన్ క్లిక్ చేయండి
మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి
- క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి
- ‘Get Data’ క్లిక్ చేయండి
- మీ పూర్తి వివరాలు కనిపిస్తాయి.
- e-KYC, Land Seeding గ్రీన్ టిక్ ఉంటే మీకు 22వ వాయిదా వస్తుంది.
ఎందుకు వెరిఫికేషన్ కఠినతరం?
కేంద్ర ప్రభుత్వం ప్రకారం, పథకం ప్రయోజనాలు అర్హత గల రైతులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో అనర్హులు కూడా లబ్ధి పొందినట్లు గుర్తించడంతో ఈసారి కఠిన పరిశీలన చేపట్టారు.
ప్రత్యేకంగా ఆదాయపు పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, పెద్ద భూస్వాములు వంటి వారు పథకానికి అనర్హులుగా పరిగణిస్తున్నారు.
రైతులకు హెచ్చరిక: మీరు 22వ వాయిదా కోసం ఎదురుచూస్తుంటే వెంటనే ఈ పనులు పూర్తి చేయాలి:
- e-KYC స్టేటస్ చెక్ చేయండి
- Land Seeding అప్డేట్ చేయండి
- Aadhaar-Bank Linking నిర్ధారించుకోండి
- పోర్టల్లో మీ వివరాలు సరైనవో లేదో చూసుకోండి
చివరి నిమిషంలో ప్రయత్నిస్తే డబ్బులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.