తెలంగాణ జీవనస్రవంతిలో భాగమైన బోనాల పండుగలో అమ్మవారికి సమర్పించే ప్రతి నైవేద్యం వెనుక ఆధ్యాత్మిక భావనతో పాటు అత్యుత్తమ శాస్త్రీయ , ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి మన పూర్వీకులు అనుసరించిన అద్భుతమైన ఆహార నియమాలు ఈ పండుగ సంప్రదాయంలో స్పష్టంగా కనిపిస్తాయి.
అమ్మవారికి నైవేద్యంగా నివేదించే బోనంలో కొత్త బియ్యం, పాలు, బెల్లం కలిపి పరమాన్నం తయారు చేస్తారు. ఇది ప్రకృతికి, భూదేవికి కృతజ్ఞతను తెలిపే అద్భుతమైన రూపం. ఇక ఉగ్రరూపంలో ఉండే అమ్మవారిని శాంతింపజేయడంతో పాటు శరీరానికి చలువ చేసే పెరుగును కుండపై ఉంచి ఊరేగింపులో దద్దోజనంగా పంచిపెడతారు. గ్రామీణ సంప్రదాయాల ప్రకారం మహమ్మారుల బారిన పడకుండా కాపాడినందుకు కృతజ్ఞతగా ఇళ్లలో నాటుకోడి, మటన్ వంటలతో ఘనంగా విందులు చేసుకుంటారు. ఈ మాంసాహారం తిన్నప్పుడు కలిగే అజీర్తిని, కడుపు ఉబ్బరాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఔషధ గుణాలున్న పచ్చి పులుసును ప్రత్యేకంగా తీసుకోవడం ఇక్కడ విశేషం.
అలాగే ఘటం ఊరేగింపులో విస్తృతంగా ఉపయోగించే పసుపు, వేపాకులు ప్రకృతి సిద్ధమైన క్రిమిసంహారకాలుగా పనిచేస్తాయి. ఇవి గాలిలోని బ్యాక్టీరిటాను అరికట్టి పరిసరాలను శుభ్రపరుస్తాయి. చరిత్రాత్మక నేపథ్యం పరిశీలిస్తే 1813లో ప్రబలిన భయంకరమైన ప్లేగు వ్యాధి నివారణ చర్యల నుంచే ఈ బోనాల పండుగ రూపుదిద్దుకుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతో ఆప్యాయంగా జరుపుకునే ఈ పండుగ విందులో పాలు, పెరుగు, నెయ్యి వంటి స్వచ్ఛమైన ఉత్పత్తులతో ప్రతి తెలంగాణ ఇంట ‘జెర్సీ’ భాగమవుతోందని గోద్రేజ్ జెర్సీ మార్కెటింగ్ హెడ్ శాంతను రాజ్ తెలిపారు.
