ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కంప్లయన్స్ , డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల కలయికతో గ్లోబల్ ఫార్మా ఏఐ, కంప్లయన్స్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ (GPACTS 2026) ఫ్లాగ్షిప్ ఎడిషన్ సెప్టెంబర్ 3, 2026న హైదరాబాద్లోని నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ (HICC) వేదికగా జరగనుంది. ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ, తయారీ, నాణ్యత, కంప్లయన్స్, డేటా , సైబర్సెక్యూరిటీ రంగాలకు చెందిన దాదాపు 350 నుంచి 400 మంది సీనియర్ నిర్ణేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
సదస్సు ప్రాముఖ్యత , ప్రధాన అంశాలు:
ఫార్మా కంపెనీలు కృత్రిమ మేధస్సు, కనెక్టెడ్ మాన్యుఫ్యాక్చరింగ్, డేటా ఆధారిత కార్యకలాపాలలో పెట్టుబడులను వేగవంతం చేస్తున్న తరుణంలో ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది.
అదే సమయంలో వాలిడేషన్, డేటా సమగ్రత (data integrity), సైబర్సెక్యూరిటీ , రెగ్యులేటరీ కంప్లయన్స్పై మరింత నిఘా పెరుగుతున్న నేపథ్యంలో.. నియంత్రిత తయారీ వాతావరణంలో నియంత్రణలను బలహీనపర్చకుండా డిజిటల్ పరివర్తనను ఎలా వేగవంతం చేయాలో ఈ వేదికపై చర్చిస్తారు.
సాంప్రదాయ టెక్నాలజీ సదస్సులకు భిన్నంగా, జీపీఏసీటీఎస్ (GPACTS) పూర్తిగా రెగ్యులేటెడ్ ఫార్మాస్యూటికల్ ఆపరేషన్స్ వాస్తవాల ఆధారంగా రూపుదిద్దుకుంది. బాధ్యతాయుతమైన ఏఐ , పాలన, అభివృద్ధి చెందుతున్న డేటా రక్షణ అవసరాలు, మాన్యుఫ్యాక్చరింగ్ సైబర్సెక్యూరిటీ, డిజిటల్ బ్యాచ్ ప్రాసెసులు, లాబొరేటరీ సాఫ్ట్వేర్ వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు.
ప్రధాన వక్తలు , భాగస్వామ్య సంస్థలు:
ఈ సదస్సుకు హనీవెల్ (Honeywell) ప్రధాన ప్రాయోజకత్వం (Powered by) వహిస్తుండగా, థర్మో ఫిషర్ సైంటిఫిక్, రాక్వెల్ ఆటోమేషన్ , నివిడస్ సాఫ్ట్వేర్ సంస్థలు సహకారం అందిస్తున్నాయి. ఈ సదస్సుకు హాజరయ్యే ప్రముఖ వక్తలలో మాజీ ఎఫ్డీఏ డైరెక్టర్ డాక్టర్ అజాజ్ హుస్సేన్, అల్కెం లాబొరేటరీస్ వీపీ & సీఐఓ రామరాణయణ పరిహి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ హెడ్ రాజేష్ టి, ఎఫ్వోపీఈ చైర్మన్ ఏవీపీఎస్ చక్రవర్తి, ఐపీఏ గౌరవ కార్యదర్శి డాక్టర్ శ్రీధర్ రెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ సర్వేశ్ సింగ్, వోక్హార్ట్ వీపీ-క్వాలిటీ ఐటీ డాక్టర్ దీపా పంగాంకర్, గ్రాన్యూల్స్ ఇండియా సీఐఓ కార్తీక్ రాజా, బయలాజికల్ ఈ వీపీ-ఐటీ ప్రవీణ్ కుమార్ బహేతి తదితరులు ఉన్నారు. ముంబై, అహ్మదాబాద్ల విజయవంతమైన ఎడిషన్ల తర్వాత, హైదరాబాద్లో మరింత విస్తృత స్థాయిలో ఈ శిఖరాగ్ర సమావేశం నిర్వహించబడుతోంది.


