హైదరాబాద్: బిట్స్ పిలానీ క్యాంపస్తో లొరియల్ (L’Oréal) గ్లోబల్ టెక్ హబ్ ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. కృత్రిమ మేధస్సు (AI), డేటా ఇంజనీరింగ్ , బ్యూటీ టెక్ ఆవిష్కరణలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడింది. దీని ద్వారా లొరియల్ సంస్థకు అకడమిక్ టాలెంట్ సులువుగా లభించనుండగా, విద్యార్థులకు గ్లోబల్ బ్యూటీ ఇండస్ట్రీలో టెక్నాలజీ అప్లికేషన్లపై వాస్తవ అనుభవం లభిస్తుంది.
బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో లొరియల్ బ్యూటీ టెక్ హెచ్ఆర్ డైరెక్టర్ మారియో గువాస్కో, లొరియల్ ఇండియా గ్లోబల్ టెక్ హబ్ హెడ్ ప్రశాంత్ విజయ్, బిట్స్ పిలానీ హైదరాబాద్ డైరెక్టర్ ఇన్చార్జ్ ప్రొఫెసర్ డి. శ్రీరామ్, ఐఆర్ఐఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. కృష్ణమూర్తి, డీన్ ఏజీఎస్ఆర్డీ ప్రొఫెసర్ వంశీ కృష్ణ వేణుగంటి తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన భాగస్వామ్య కార్యక్రమాలు:
అకడమిక్ & ఇండస్ట్రీ ఎక్స్ఛేంజ్: హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ ఛాలెంజ్లు, గెస్ట్ లెక్చర్లు, సెమినార్లు , కరిక్యులమ్ డెవలప్మెంట్లను సంయుక్తంగా నిర్వహించడం.
ఆన్-క్యాంపస్ ఎంగేజ్మెంట్: జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ , లార్జ్-స్కేల్ డేటా ఇంజనీరింగ్ వాస్తవ అనువర్తనాలను విద్యార్థులకు వివరించడానికి లొరియల్ ఎగ్జిక్యూటివ్లు క్యాంపస్ను సందర్శించారు.
టాలెంట్ యాక్సెస్: టెక్, ఏఐ , డేటా రంగాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ను , టాలెంట్ అక్విజిషన్ కోసం ప్రత్యక్ష మార్గాలను ఇది సులభతరం చేస్తుంది.
వ్యూహాత్మక నేపథ్యం:
జనవరి 2026లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తొలిసారిగా ప్రకటించిన లొరియల్ హైదరాబాద్లోని గ్లోబల్ టెక్ హబ్, 2030 నాటికి రూ.3,500 కోట్లకు పైగా (€350 మిలియన్లు) పెట్టుబడితో ఏర్పాటు చేయబడింది. తతర తరానికి చెందిన గ్లోబల్ బ్యూటీ సర్వీసెస్ను అందించడానికి డేటా, ఏఐ, జనరేటివ్ ఏఐ , ఏజెంటిక్ ఏఐలను ఉపయోగించడంలో ఈ హబ్ ఫ్లాగ్షిప్ సౌకర్యంగా పనిచేస్తుంది.
ఈ ఒప్పందంపై ప్రశాంత్ విజయ్ మాట్లాడుతూ.. అత్యుత్తమ ఇంజనీరింగ్ టాలెంట్ అందుబాటులోకి రావడం తమ ఏఐ లక్ష్యాలను వేగవంతం చేస్తుందని తెలిపారు. అలాగే ప్రొఫెసర్ మోహన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఈ అనుబంధం లైఫ్ సైన్సెస్, డేటా, ఏఐ అప్లికేషన్లు, సుస్థిరత (సస్టైనబిలిటీ) , అధునాతన ఉత్పత్తి పరిశోధనలలో బలమైన అవకాశాలను తెరుస్తుందని పేర్కొన్నారు.