ఏఐ (కృత్రిమ మేధస్సు) సహాయక సాఫ్ట్వేర్ అభివృద్ధిని వేగవంతం చేయడంలో అగ్రగామిగా ఉన్న సోనాటైప్ సంస్థ, టెక్నాలజీ, సైబర్సెక్యూరిటీ , వ్యాపార రంగాల నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఫారెస్టర్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కృత్రిమ మేధస్సు ఏ విధంగా సాఫ్ట్వేర్ సప్లై చైన్ రిస్క్లను మారుస్తోందనే అంశంపై ఈ గురు ఫోరమ్ చర్చించింది.
సోనాటైప్ నిర్వహించిన “ది ట్రస్ట్ ఎకానమీ ఆఫ్ సాఫ్ట్వేర్: హౌ ఏఐ ఈజ్ రీషేపింగ్ సాఫ్ట్వేర్ సప్లై చైన్ రిస్క్ ఫర్ ఫైనాన్షియల్ సర్వీసెస్” అనే తాజా పరిశోధన ఆధారంగా ఈ చర్చ సాగింది. జనవరి 2020 నుంచి మే 2026 మధ్య సేకరించిన 9,747 ధృవీకరించిన హానికరమైన ప్యాకేజీ అడ్వైజరీల విశ్లేషణ ఆధారంగా దాడుల స్వభావంలో వస్తున్న మార్పులను ఈ అధ్యయనం వెల్లడించింది.
ప్రధాన పరిశోధన ముఖ్యాంశాలు:
లక్షిత సలహాల పెరుగుదల: లక్షిత హానికరమైన ప్యాకేజీ అడ్వైజరీలు రెండేళ్ల కాలంలో ఏకంగా 75 రెట్లు పెరిగాయి. ఇవి 2023లో 28 ఉండగా, 2025 నాటికి 1,576కి చేరుకున్నాయి.
ఇంపర్సనేషన్ పద్ధతులు: దాదాపు 47 శాతం హానికరమైన ప్యాకేజీలు సుపరిచితమైన పేర్లు, ఇంటిగ్రేషన్లు , యుటిలిటీలను పోలి ఉంటూ నమ్మదగిన సాఫ్ట్వేర్గా నటిస్తున్నాయి.
డెవలపర్లను టార్గెట్ చేయడం: 2025లో విశ్లేషించిన హానికరమైన ప్యాకేజీలలో 53 శాతం సాంప్రదాయ భద్రతా నియంత్రణలు జోక్యం చేసుకునే ముందే, ఇన్స్టాలేషన్ దశలోనే డెవలపర్లను నేరుగా లక్ష్యంగా చేసుకున్నాయి.
అధునాతన టెక్నిక్స్: నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ హానికరమైన ప్యాకేజీ అడ్వైజరీలు అబ్ఫ్యూకేషన్, మల్టీ-స్టేజ్ డ్రాపర్లు , బ్యాక్డోర్ల వంటి అధునాతన పద్ధతులను ఉపయోగిస్తున్నాయి.
భారతీయ సంస్థలు , జీసీసీలపై ప్రభావం:
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్వేర్ హబ్లలో ఒకటిగా, ఫిన్టెక్, డిజిటల్ ఇంజనీరింగ్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీలు)కు కేంద్రంగా ఉన్న భారతదేశానికి ఈ ఫలితాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారతీయ సంస్థలు , జీసీసీలు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, థర్డ్-పార్టీ కాంపోనెంట్స్ , ఏఐ-సహాయక అభివృద్ధిపై ఆధారపడటాన్ని విస్తరిస్తున్న కొద్దీ, సాఫ్ట్వేర్ లైఫ్సైకిల్లోకి ఏది ప్రవేశిస్తుందో నియంత్రించడం అత్యంత కీలకమైన వ్యాపార ప్రాధాన్యతగా మారింది.
నాయకుల అభిప్రాయాలు:
సోనాటైప్ ఇండియా కంట్రీ హెడ్ అభిషేక్ చౌహాన్ మాట్లాడుతూ, డెవలప్మెంట్ టీమ్లు వేగంగా సాఫ్ట్వేర్ రూపొందించడంలో ఏఐ సహాయపడుతున్నప్పటికీ, దాన్ని ఎంతవరకు నమ్మాలో నిర్ణయించుకోవడంలో అటాకర్లు ఖచ్చితమైన దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. భారతీయ సంస్థలు ఏఐ వాడకాన్ని మందగించడం కాకుండా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోకి ప్రవేశించే దశలోనే విశ్వసనీయమైన పాలనను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఫారెస్టర్ వీపీ అండ్ ప్రిన్సిపాల్ అనలిస్ట్ అశుతోష్ శర్మ మాట్లాడుతూ, సాఫ్ట్వేర్ తయారీతో పాటు కాంపోనెంట్ల గుర్తింపు, ఎంపిక విధానాన్ని కూడా ఏఐ మారుస్తోందని, ఆవిష్కరణలను నిలకడతో బ్యాలెన్స్ చేయడానికి పాలనా విధానాలు మారాలని పేర్కొన్నారు.