రైలు ప్రయాణికులకు అలర్ట్: పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు!

రాయనపాడు రైల్వే పనుల వల్ల సికింద్రాబాద్, లింగంపల్లి వైపు వచ్చే పలు రైళ్లు రద్దు మరియు దారి మళ్లింపు. ప్రయాణికులు తనిఖీ చేసుకోవాలని రైల్వే శాఖ సూచన.

South Central Railway official notices regarding train cancellations and diversions
South Central Railway official notices regarding train cancellations and diversions

రైల్వే పనుల వల్ల సామాన్య ప్రజలకు కష్టాలు తప్పేలా లేవు.విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే పనుల కారణంగా పలు రైలు సర్వీసుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక:

  • విజయవాడ – దువ్వాడ సెక్షన్‌లోని రాయనపాడు యార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు మార్పులు చేసింది:
  • రైళ్ల రద్దు (Cancellation): ఏప్రిల్ 28 నుండి మే 5 వరకు పలు కీలక రైళ్లు రద్దయ్యాయి. వాటిలో ముఖ్యమైనవి:
  • విజయవాడ – భద్రాచలం రోడ్ (67215/6), విజయవాడ – డోర్నకల్ (67768/7).
  • విజయవాడ – సికింద్రాబాద్ (12713/4), గుంటూరు – సికింద్రాబాద్ (17201/2).
  • విశాఖపట్నం – మహబూబ్‌నగర్ (12861/2), కాకినాడ పోర్ట్ – లింగంపల్లి (12737/8).

రైళ్ల దారి మళ్లింపు (Diversion):

మే 1 నుండి మే 5 వరకు ప్రయాణించాల్సిన విశాఖపట్నం – LTT ముంబై, మచిలీపట్నం – సాయినగర్ షిరిడీ, షాలిమార్ – చర్లపల్లి వంటి రైళ్లు గుంటూరు, కృష్ణా కెనాల్ మీదుగా దారి మళ్లించబడ్డాయి. వీటి వల్ల కాజీపేట, వరంగల్, ఖమ్మం వంటి స్టేషన్లలో స్టాపేజీలు రద్దయ్యాయి.

సమ్మర్ స్పెషల్ రైళ్ల పొడిగింపు:

  • వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని స్పెషల్ రైళ్లను పొడిగించారు:
  • చర్లపల్లి – రక్సాల్ (07005/6): ఏప్రిల్ 12 నుండి మే 31 వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది.
  • చర్లపల్లి – తిరుచిరాపల్లి (07615/6): ఏప్రిల్ 14 నుండి జూన్ 3 వరకు అందుబాటులో ఉంటాయి.

Also read: బెజవాడ లులూ మాల్‌కు హైకోర్టులో బ్రేక్: ఆర్టీసీ భూముల కేటాయింపుపై కూటమి సర్కార్ వెనక్కి!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »