గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (GIG) మూడవ విడత ‘నేషనల్ కెమిస్ట్రీ డే సమ్మిట్’ను ఘనంగా నిర్వహించింది. GIG కంపెనీలైన గోద్రెజ్ ఇండస్ట్రీస్ (కెమికల్స్) , ఆస్టెక్ లైఫ్సైన్సెస్ సంయుక్తంగా చేపట్టిన ఈ సదస్సు, “కొత్త యుగంలో సుస్థిరతను నిలుపుకోవడం” (Staying Resilient in a New Age World) అనే ప్రధానాంశంపై రసాయన పరిశ్రమలోని ప్రముఖులను ఒకే వేదికపైకి తెచ్చింది. వ్యాపారాలు భవిష్యత్తు కోసం ఎలా సన్నద్ధం కావాలి, ఆవిష్కరణలు , సాంకేతికత ద్వారా ఎలా రాణించాలనే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు.
సదస్సు ముఖ్యాంశాలు , చర్చా గోష్టులు:
మొదటి ప్యానెల్ చర్చ: గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ విశాల్ శర్మ మోడరేట్ చేసిన మొదటి ప్యానెల్లో క్రోడాకు చెందిన మురళి కృష్ణ దువ్వూరి, బాస్ఫ్ ఇండియాకు చెందిన అలెగ్జాండర్ గెర్డింగ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు చెందిన బంకిమ్ పాత్ర తదితరులు పాల్గొన్నారు. భారత్ కెమికల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సరఫరా వ్యవస్థలో మెరుగైన సహకారం, సాంకేతికత, ఆర్ అండ్ డీ (R&D) భాగస్వామ్యాల అవసరాన్ని ఈ చర్చ నొక్కిచెప్పింది.
రెండవ ప్యానెల్ చర్చ: సందీప్ అరోడా మోడరేట్ చేసిన రెండవ ప్యానెల్లో సూపర్ఫార్మ్ సీఈఓ రాజ్ తివారీ, బిర్లా ఒపస్ సీఓఓ అజిత్ కుమార్, ఇన్నోవిస్ట్ కో-ఫౌండర్ విమల్ భోలా పాల్గొని సంస్థాగత వృద్ధి, చురుకుదనం , ప్రతిభను పెంపొందించుకోవడంపై చర్చించారు.