అవినీతి చేస్తే ఉద్యోగం ఊడేలా చేస్తా: ఐఏఎస్ శ్రీజన

సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన కఠిన హెచ్చరికలు జారీ చేశారు. టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి తావులేదని స్పష్టం చేస్తూ, నగర శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

IAS Srijana

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పరిపాలనను క్రమబద్ధీకరించేందుకు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి Srijana Gummalla దూకుడు చూపిస్తున్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిని అరికట్టడమే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. “నేను అవినీతి చేయను.. అధికారులను కూడా చేయనివ్వను” అంటూ ఆమె అధికారులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.

పట్టణంలో శానిటేషన్ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమిషనర్ శ్రీజన, రోడ్లపై చెత్త కనిపించకూడదని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినా, చెత్తను తొలగించకుండా వదిలేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఫీల్డ్ విజిట్లతో అధికారులు అలర్ట్

కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీజన తరచూ ఫీల్డ్ విజిట్లు నిర్వహిస్తూ నగర పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఎక్కడ సమస్య కనిపించినా వెంటనే స్పందిస్తూ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

Also Read: వాయు కాలుష్య నియంత్రణకు తెలంగాణ కీలక నిర్ణయం.. ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు, రూ.200 కోట్లతో ప్రత్యేక పాలసీ

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయి సౌకర్యాలు లేకపోయినా, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్

హైదరాబాద్ సాధారణంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఈ విభాగంలో అలాంటి పరిస్థితి ఉండకూడదని కమిషనర్ స్పష్టం చేశారు. “నో కరప్షన్.. నో నెగ్లిజెన్స్.. ఓన్లీ వర్క్” అనే విధంగా పని చేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.

ఎక్కడైనా అవినీతి జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఉద్యోగం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆమె హెచ్చరించినట్లు సమాచారం.

ప్రజలకు పారదర్శక సేవలు

ప్రజలకు పారదర్శకమైన, అవినీతిరహిత పరిపాలన అందించడమే తమ లక్ష్యమని కమిషనర్ తెలిపారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా వ్యవస్థను మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

సమస్యల పరిష్కారం కోసం మీడియా, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు.

సైబరాబాద్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాల్లో ఒకటి. ఇలాంటి ప్రాంతాల్లో పట్టణ ప్రణాళిక, శానిటేషన్, నిర్మాణ అనుమతుల వ్యవస్థ పారదర్శకంగా ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్న కమిషనర్ శ్రీజన చర్యలు పరిపాలనలో పారదర్శకత పెంచే అవకాశముందని ప్రజలు భావిస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »