- TGIIC వైస్ చైర్మన్ & ఎండీ కె. శశాంక IAS – JLL, MSTC సహకారంతో నిర్వహించిన ఈ-వేలం
- ఉస్మాన్ నగర్లో ప్లాట్ నెంబర్ 1 ఎకరాకు రూ.51.25 కోట్లకు అమ్మకం – వెయిటెడ్ యావరేజ్ రూ.48.6 కోట్లు/ఎకరా
- హైదరాబాద్ ఉస్మాన్ నగర్ – ORR, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి తన శక్తిని నిరూపించుకుంది. TGIIC నిర్వహించిన ఉస్మాన్ నగర్ ఈ-వేలంలో ఎకరాకు రూ.51.25 కోట్ల రికార్డు ధర సాధించారు. రిజర్వ్ ధర రూ.39 కోట్లు అయితే – చివరకు 30 శాతం అధికంగా రూ.51.25 కోట్లకు బిడ్డింగ్ ముగిసింది. దేశంలో ప్రభుత్వ భూ వేలంల్లో ఇది అత్యంత అధిక ధరల్లో ఒకటిగా నిలిచింది. హైదరాబాద్ పెట్టుబడిదారుల నమ్మకాన్ని ఈ ఒక్క వేలం స్పష్టంగా చెప్తోంది.
ప్లాట్ నెంబర్ 1 (10.09 ఎకరాలు) లో అగ్రశ్రేణి డెవలపర్ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ప్లాట్ నెంబర్ 6 (5.72 ఎకరాలు) కూడా ఎకరాకు రూ.44 కోట్లు సాధించింది. మొత్తం వేలంలో వెయిటెడ్ యావరేజ్ రూ.48.6 కోట్లు/ఎకరాగా నమోదైంది.
Also Read : అన్విత గ్రూప్కు బ్రాండ్ అంబాసిడర్గా బాలకృష్ణ
ఉస్మాన్ నగర్ ఎందుకు ఇంత విలువైనది?
ఔటర్ రింగ్ రోడ్డు (ORR), నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, IT హబ్లకు చేరువగా ఉండటం ఈ ప్రాంతాన్ని అత్యంత వ్యూహాత్మక లొకేషన్గా మార్చింది. మల్టీ-యూజ్ జోనింగ్ కావడంతో రెసిడెన్షియల్, కమర్షియల్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్లకు అనుకూలంగా ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రో-మార్కెట్గా ఉస్మాన్ నగర్ గుర్తింపు పొందడంతో డెవలపర్లు అధిక ధర చెల్లించడానికి వెనకాడలేదు.
TGIIC ఎండీ స్పందన
TGIIC వైస్ చైర్మన్ & ఎండీ కె. శశాంక IAS మాట్లాడుతూ – “ఈ ఫలితం హైదరాబాద్ పయనంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి నేరుగా అద్దం పట్టింది” అని పేర్కొన్నారు. ట్రాన్సాక్షన్ అడ్వైజర్ JLL మరియు ఈ-వేలం పార్టనర్ MSTC సహకారంతో పారదర్శకంగా, విశ్వసనీయంగా వేలం జరిగిందని అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డి, IT మరియు పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వాన్ని ప్రశంసించారు.
తెలంగాణ ముందుకు దూసుకుపోతోంది
డిజిటల్, మెరిట్ ఆధారిత వ్యవస్థలు అమలు చేయడం వల్ల పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని TGIIC స్పష్టం చేసింది. హైదరాబాద్ కేవలం జాతీయ స్థాయిలో పోటీ పడటం లేదు – నేతృత్వం వహిస్తోందని ఈ వేలం నిరూపించింది. పారదర్శక ప్రక్రియలు, స్మార్ట్ గవర్నెన్స్, వ్యూహాత్మక భూ అభివృద్ధి కలిసి అసాధారణ విలువను సాధించగలవని ఈ వేలం మార్కెట్కు సందేశం ఇచ్చింది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పట్ల పెట్టుబడిదారుల ధైర్యం తగ్గలేదు – పెరిగింది. ఇది తెలంగాణకు శుభసంకేతం.
Also Read : తెల్లాపూర్, భూముల వేలంపై స్థానికుల సెగ.. ‘ముందు వసతులు.. తర్వాతే ఆక్షన్’ అంటూ డిమాండ్!


