PM Rashtriya Bal Puraskar 2026 నామినేషన్లకు ఆహ్వానం

విశేష ప్రతిభ, సాహసం, సామాజిక సేవతో గుర్తింపు పొందిన పిల్లలకు అందించే ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2026’ కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానించింది. దరఖాస్తుల గడువును ఆగస్టు 15 వరకు పొడిగించింది.

PM Rashtriya Bal Puraskar 2026
PM Rashtriya Bal Puraskar 2026
  • పథకం: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2026
  • అర్హులు: 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు
  • చివరి తేదీ: 2026 ఆగస్టు 15

సమాజంపై సానుకూల ప్రభావం చూపుతూ అసాధారణ ప్రతిభ, సాహసం, సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన పిల్లలకు కేంద్ర ప్రభుత్వం అందించే ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP)-2026’ కోసం నామినేషన్లను ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

దేశంలో బాలలకు అందించే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ఈ అవార్డు ద్వారా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన పిల్లలను కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తుంది.

ఏ ఏ రంగాల్లో పురస్కారాలు ఇస్తారు?

ఈ పురస్కారాలను మొత్తం ఆరు విభాగాల్లో ప్రదానం చేస్తారు.

  • సాహసం (Bravery)
  • సామాజిక సేవ
  • పర్యావరణ పరిరక్షణ
  • క్రీడలు
  • కళలు, సంస్కృతి
  • శాస్త్ర, సాంకేతిక రంగం

ఈ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పిల్లలు నామినేషన్లకు అర్హులు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

  • భారతీయ పౌరులు కావాలి.
  • దేశంలోనే నివసిస్తూ ఉండాలి.
  • 2026 జూలై 31 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసి, 18 ఏళ్లలోపు వయస్సు ఉండాలి.
  • నామినేషన్ తేదీకి ముందు రెండేళ్లలో చేసిన విశేష ప్రతిభ, సాహసం లేదా సేవలను పరిగణనలోకి తీసుకుంటారు.

ఎవరు నామినేట్ చేయవచ్చు?

ఈ పురస్కారం కోసం..

  • పిల్లలు స్వయంగా
  • తల్లిదండ్రులు
  • విద్యాసంస్థలు
  • స్వచ్ఛంద సంస్థలు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
  • పార్లమెంట్ సభ్యులు
  • జిల్లా కలెక్టర్లు
  • ఇతర అర్హత కలిగిన సంస్థలు

నామినేషన్లను సమర్పించవచ్చు.

విజేతలకు ఏమి లభిస్తుంది?

ప్రతి విజేతకు..

పతకం, ధ్రువీకరణ పత్రం, ప్రశంసా పత్రం అందజేస్తారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ కమిటీ సిఫార్సుల మేరకు గరిష్టంగా 25 మంది పిల్లలను ఎంపిక చేస్తారు.

ఎప్పుడు ప్రకటిస్తారు?

ఎంపికైన విజేతలను 2026 డిసెంబర్ 26న వీర బాల్ దివస్ సందర్భంగా ప్రకటిస్తారు. అనంతరం న్యూఢిల్లీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలను ప్రదానం చేస్తారు.

దరఖాస్తు గడువు పెంపు

ముందుగా నిర్ణయించిన గడువును కేంద్ర ప్రభుత్వం 2026 ఆగస్టు 15 వరకు పొడిగించింది. ఆసక్తి, అర్హత కలిగిన పిల్లలు లేదా సంస్థలు ఆన్‌లైన్‌లో నామినేషన్లు సమర్పించవచ్చు.

ఎలా దరఖాస్తు చేయాలి?

నామినేషన్లు రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.

దరఖాస్తు వెబ్‌సైట్: https://awards.gov.in

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2026కు ఎవరు అర్హులు?

2026 జూలై 31 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసి, 18 ఏళ్లలోపు ఉన్న భారతీయ పిల్లలు అర్హులు.

Q2. దరఖాస్తుల చివరి తేదీ ఎప్పుడు?

నామినేషన్ల సమర్పణ గడువును 2026 ఆగస్టు 15 వరకు పొడిగించారు.

Q3. ఏ ఏ రంగాల్లో ఈ పురస్కారాలు అందిస్తారు?

సాహసం, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు-సంస్కృతి, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో పురస్కారాలు ప్రదానం చేస్తారు

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »