చెపాక్‌లో సీఎస్కే బ్యాటింగ్ బోర్ కొట్టించింది .. 50 డాట్ బాల్స్‌తో ఫ్యాన్స్ షాక్,టీమ్‌కి ఏమైంది?

చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణ బ్యాటింగ్ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. తొలి 13 ఓవర్లలోనే 50 డాట్ బాల్స్ ఆడటం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది.

CSK vs GT:చెపాక్‌లో సీఎస్కే బ్యాటింగ్ డిజాస్టర్.. చెలరేగిన సాయి సుదర్శన్, గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం!
CSK vs GT:చెపాక్‌లో సీఎస్కే బ్యాటింగ్ డిజాస్టర్.. చెలరేగిన సాయి సుదర్శన్, గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం!

చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. హోం గ్రౌండ్ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోలేకపోయిన సీఎస్కే జట్టు, గుజరాత్ టైటాన్స్ ముందు తేలిపోయింది. ముఖ్యంగా తొలి 13 ఓవర్లలోనే 50 డాట్ బాల్స్ ఆడటం అభిమానులను షాక్‌కు గురిచేసింది. సోషల్ మీడియాలో ఈ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుని సీఎస్కేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ముంబైపై గత మ్యాచ్‌లో భారీ విజయంతో వచ్చిన జోష్ కొనసాగుతుందని భావించిన అభిమానులకు మొదటి నుంచే నిరాశ ఎదురైంది. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయిన సీఎస్కే ఒత్తిడిలో పడింది.

ప‌వ‌ర్ ప్లేలో కేవ‌లం 28 ప‌రుగులు..

మొదటి మూడు ఓవర్లలో 21 పరుగులు చేసిన చెన్నై, 13 ఓవర్లు ముగిసే సమయానికి కేవలం 66 పరుగులకే పరిమితమైంది. పవర్‌ప్లేలో కూడా 28 పరుగులు మాత్రమే రావడం జట్టు స్థితిని మరింత క్లిష్టం చేసింది. ఒక దశలో జట్టు 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ సమయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యత తీసుకుని జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ప్రారంభంలో నెమ్మదిగా ఆడిన అతడు, తర్వాత తన క్లాస్ చూపిస్తూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. 60 బంతులు ఎదుర్కొన్న రుతురాజ్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని పోరాటంతో సీఎస్కే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగలిగింది.

సునాయాస విజ‌యం..

అయితే లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సునాయాసంగా మ్యాచ్‌ను ముగించింది. సాయి సుదర్శన్ అద్భుత బ్యాటింగ్‌తో 46 బంతుల్లో 87 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడు. శుభ్‌మన్ గిల్ 33 పరుగులతో సహకరించాడు. కేవలం 16.4 ఓవర్లలోనే గుజరాత్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

బౌలింగ్‌లో కగిసో రబడా చెలరేగి నాలుగు ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అతని ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొత్తానికి, ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించగా, గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో మరో విజయం ఖాతాలో వేసుకుంది.

Also Read:

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »