హైదరాబాద్: గత రెండు రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిస్థితుల వల్ల దేశీయంగా బంగారం ధరలు ఇవాళ దిగివచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, గ్లోబల్ మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది.
హైదరాబాద్లో తగ్గిన బంగారం ధరలు:
హైదరాబాద్ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు ధరలు గణనీయంగా తగ్గాయి. తాజా రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): నేడు హైదరాబాద్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,52,460 కి చేరుకుంది.
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,39,750 వద్ద కొనసాగుతోంది.
వెండి ధర స్థిరంగా..
బంగారం ధరలు తగ్గగా, వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర ఔన్సుకు సుమారు 2.61 శాతం మేర తగ్గడం విశేషం.
ఎందుకు తగ్గాయి?
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, కాల్పుల విరమణపై అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ, అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 44 డాలర్ల మేర పడిపోవడమే దేశీయంగా ఈ తగ్గుదలకు ప్రధాన కారణం.
పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఏప్రిల్ 13, సోమవారం ఉదయం 10 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం నమోదైనవి. బులియన్ మార్కెట్ పరిస్థితుల బట్టి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు ఉండవచ్చు.
Also Read:

