మేడ్చల్: సినిమా కథను మించిన దారుణం హైదరాబాద్ పోచారంలో చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్న కోపంతో ఒక యువతికి హెచ్ఐవీ (HIV) రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన యువకుడి పైశాచికత్వం, ఆ యువతి ప్రాణం తీసింది. మనోహర్ అనే యువకుడి చేతిలో మోసపోయిన బాధితురాలు రమణి, సమాజంలో గౌరవం పోయిందని ఆవేదన చెందుతూ ఆత్మహత్యకు పాల్పడింది.
అసలేం జరిగింది? (ఘటన నేపథ్యం):
పోచారం ఐటీ కారిడార్ పరిధిలో నివసించే రమణికి, వరుసకు బావ అయ్యే మనోహర్తో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని వెంటపడటంతో రమణి మొదట నిరాకరించినా, తర్వాత అంగీకరించింది. అయితే, కానిస్టేబుల్ పరీక్షల సమయంలో మనోహర్కు మెడికల్ టెస్ట్ చేయగా అతనికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. ఆ విషయం తెలిసినప్పటి నుండి రమణి అతనికి దూరంగా ఉండటం ప్రారంభించింది.
ప్రాణం తీసిన పైశాచికత్వం:
మనోహర్ తనను పెళ్లి చేసుకోవాలని రమణిపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. 2025లో వీరిద్దరికీ మళ్ళీ పరీక్షలు చేయించగా.. మనోహర్కు పాజిటివ్, రమణికి నెగిటివ్ అని వచ్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆ సంబంధాన్ని నిరాకరించి, ఫిబ్రవరిలో రమణికి మరో పెళ్లి సంబంధం ఖాయం చేశారు.
మార్చి 11న దాడి: తమ ప్రేమ విఫలమైందన్న కక్షతో, మార్చి 11న రమణి ఇంటికి వెళ్లిన మనోహర్, ఆమెకు బలవంతంగా ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించాడు.
పోలీసుల చర్య: ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదు చేసిన పోచారం పోలీసులు మనోహర్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Also Read : Pocharam News : ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తరహా ఘటన.. పెళ్లి నిరాకరించిందని ఎయిడ్స్ ఇంజెక్షన్!
సెల్ఫీ వీడియోలో బాధితురాలి ఆవేదన:
ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రమణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు ఆమె తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది.
“నా జీవితాన్ని ఆగం చేశాడు.. గౌరవం లేకుండా నేను బ్రతకలేను. నన్ను నమ్మించి, ప్రేమించి ఇలా చేశాడు. కొంతమంది నాపై లేనిపోని ప్రచారాలు చేశారు. ఎయిడ్స్ ఇంజెక్షన్ చేసిన రోజే నా స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పాను. ఎలాగో చనిపోవాలన్న ఆలోచనతోనే ఆసుపత్రికి వెళ్ళలేదు.” అని ఆ వీడియోలో రమణి వాపోయింది.
ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన ఘటనలో చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న యువతి
నా జీవితాన్ని ఆగం చేశాడు.. గౌరవం లేకుండా నేను బ్రతకలేను
మనోహర్ అనే వ్యక్తి ఎంటర్ కావడంతో నా జీవితం నాశనమైంది
వరుసకి బావ అవ్వడంతో నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు
నేను మొదట అతని ప్రేమను… https://t.co/RbyJCs0Nb8 pic.twitter.com/pHJAAO7eDw
— Telugu Scribe (@TeluguScribe) April 11, 2026
మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు మనోహర్ జైలులో ఉండగా, రమణి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.


