Vastu Shastra
-
వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గదిలో దేవుళ్ల విగ్రహాలను సరైన క్రమంలో ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.
-
హనుమంతుడు–శని, లక్ష్మీదేవి–కాళీమాత వంటి విగ్రహాలను పక్కపక్కన ఉంచడం వాస్తు దోషాలకు కారణమవుతుంది.
-
విరిగిన, మురికి పట్టిన లేదా ఒకే దేవుడి అనేక విగ్రహాలు ఇంట్లో ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి.
హైదరాబాద్: హిందూ సంప్రదాయంలో పూజా గదికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇంటికి వెన్నెముక లాంటి పూజా గది వాస్తు ప్రకారం(Vastu Shastra) ఉంటేనే ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. చాలామంది భక్తితో రకరకాల దేవుళ్ల విగ్రహాలను పూజా గదిలో కొలుస్తుంటారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఏ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి? ఏ విగ్రహాలు పక్కపక్కన ఉండకూడదు? అనే విషయాల్లో అవగాహన లేకపోతే మేలు కంటే కీడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. పూజా గదిలో విగ్రహాల ఏర్పాటు విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కుటుంబ ప్రశాంతతను దెబ్బతీస్తాయి.
మరి వాస్తు ప్రకారం (Vastu Shastra)పూజా గదిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
1. హనుమంతుడు – శని దేవుడు:
చాలామంది శని ప్రభావం తగ్గాలని శని దేవుడిని, హనుమంతుడిని పూజిస్తుంటారు. కానీ పూజా గదిలో వీరిద్దరి విగ్రహాలను ఎప్పుడూ పక్కపక్కన ఉంచకూడదు. ఈ రెండు శక్తులు వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటాయి. వీటిని పక్కపక్కన పెట్టడం వల్ల ఇంట్లో ఎదుగుదల తగ్గిపోవడమే కాకుండా, పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
2. లక్ష్మీదేవి – కాళీమాత:
లక్ష్మీదేవి ప్రశాంతతకు, ఐశ్వర్యానికి చిహ్నం. కాళీమాత ఉగ్రరూపానికి సంకేతం. వాస్తు ప్రకారం ఈ రెండు విగ్రహాలను పక్కపక్కన పెట్టడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత లోపించే ప్రమాదం ఉంది.
3. రెండు శివలింగాలు:
శివలింగం సాక్షాత్తు పరమశివుని స్వరూపం. ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ శివలింగం ఉంటే, దానికి ప్రతిరోజూ తప్పనిసరిగా బిల్వపత్రాలతో పూజ చేయాలి. రెండు శివలింగాలను పక్కపక్కన పెడితే దోషం కలుగుతుంది.
4. ఒకే దేవుడి విగ్రహాలు అనేకం :
భక్తి కొద్దీ కొందరు ఒకే దేవుడికి సంబంధించిన రెండు మూడు విగ్రహాలను పూజా గదిలో పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం ఒక దేవుడికి ఒక విగ్రహం ఉంటేనే మంచిది. అలాగే విగ్రహాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. మురికి పట్టిన విగ్రహాలు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి.
5. భిన్నమైన లేదా విరిగిన విగ్రహాలు:
విగ్రహం చిన్నగా పగిలినా లేదా విరిగిపోయినా వెంటనే దానిని పూజా గది నుంచి తొలగించాలి. విరిగిన విగ్రహాలు ప్రతికూల శక్తిని వ్యాపింపజేస్తాయి. వీటిని ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయడం లేదా చెట్టు మొదట్లో ఉంచడం ఉత్తమం.
పూజా గది కేవలం దేవుళ్ల విగ్రహాలను పెట్టే చోటు మాత్రమే కాదు, అది ఇంటికి శక్తినిచ్చే కేంద్రం. అందుకే పైన పేర్కొన్న వాస్తు నియమాలను పాటిస్తూ దైవారాధన చేసుకుంటే ఇంట్లో సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లి విరుస్తాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు
Q1: పూజా గదిలో రెండు శివలింగాలు ఉంచవచ్చా?
A: వాస్తు ప్రకారం ఇంట్లో ఒకే శివలింగం ఉండాలి. రెండు శివలింగాలు పక్కపక్కన ఉంచడం దోషంగా భావిస్తారు.
Q2: విరిగిన దేవుడి విగ్రహాన్ని ఏమి చేయాలి?
A: విరిగిన విగ్రహాన్ని వెంటనే పూజా గది నుంచి తొలగించి, ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి లేదా చెట్టు మొదట్లో ఉంచాలి.
Q3: ఒకే దేవుడి రెండు విగ్రహాలు ఉంచితే తప్పేనా?
A: అవును. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక దేవుడికి ఒకే విగ్రహం ఉండటం శ్రేయస్కరం.


