Smooth digestion
హైదరాబాద్: మలబద్ధకం అనేది నేటి కాలంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన జీర్ణ సమస్య. శరీరంలో తగినంత పీచు పదార్థం లేకపోవడం, నీరు తక్కువగా తాగడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అయితే, మన వంటింట్లో దొరికే ఎండిన పండ్లు ఈ సమస్యకు సహజసిద్ధమైన పరిష్కారాన్ని అందిస్తాయని శాస్త్రీయ అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఎండిన పండ్లు మలబద్ధకాన్ని తగ్గించడంలో ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయో స్పష్టమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
- ప్రతిరోజూ అర కప్పు (సుమారు 80-90 గ్రాములు) ఎండిన పండ్లను తిన్న వారిలో ప్రేగు కదలికలు గణనీయంగా మెరుగుపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పండ్లలోని పోషకాలు మలం బరువును పెంచి, విసర్జన ప్రక్రియను సులభతరం చేస్తాయి.
- ఎండిన పండ్లలో, ముఖ్యంగా ప్రూనే (Prunes), ఎండు ద్రాక్ష, అంజీర, ఆప్రికాట్లలో రెండు ముఖ్యమైన అంశాలు ఉంటాయి.
- పీచు పదార్థం (Fiber): ఇది ప్రేగులలోకి నీటిని లాగి, మలాన్ని మృదువుగా చేస్తుంది.
- సార్బిటాల్ (Sorbitol): ఇది పండ్లలో ఉండే ఒక రకమైన చక్కెర. ఇది సహజ సిద్ధమైన ‘లాక్సేటివ్’ (భేదిమందు) లా పనిచేసి, విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది.

జ్యూస్ కంటే పండు తినడమే(Smooth digestion) మేలు:
చాలామంది పండ్ల రసాలు తాగడానికి మొగ్గు చూపుతారు. అయితే, అధ్యయనం ప్రకారం పండ్ల రసం తాగడం వల్ల కూడా కొంత ఫలితం ఉంటుంది కానీ, నేరుగా ఎండిన పండ్లను తినడం వల్ల వచ్చే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఎండిన పండ్లు తిన్నవారిలో మలం బరువు పెరిగి, ప్రేగులు పూర్తిగా ఖాళీ అయిన అనుభూతి కలుగుతుంది. అదే రసాలు తాగిన వారిలో కడుపులో గడబిడ (శబ్దాలు) ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
జాగ్రత్తలు :
ఎండిన పండ్లు మంచివే కదా అని అతిగా తినకూడదు. అతిగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంది. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఓట్స్తో కలిపి లేదా స్నాక్స్లా తీసుకోవచ్చు. పీచు పదార్థం తీసుకున్నప్పుడు తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం.
మలబద్ధకం నుండి ఉపశమనం పొందడాని(Smooth digestion)కి మందుల కంటే సహజమైన మార్గాలు ఎంచుకోవడమే ఉత్తమం. ప్రతిరోజూ నిర్ణీత మోతాదులో ఎండిన పండ్లను మీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, మీ జీవన నాణ్యత కూడా పెరుగుతుంది.


