Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు సమీపంలోని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఏపీలో 16 జిల్లాలకు వర్ష సూచన
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని మరో 13 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇవాళ ఏపీలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది.
ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, విజయవాడ ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణలోనూ భారీ వర్షాల హెచ్చరికలు Weather Update:
తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
హైదరాబాద్లోనూ ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని సూచించింది. ఉమ్మడి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్ష ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి, మహబూబ్నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఉరుములు, ఈదురుగాలులతో జాగ్రత్త Weather Update:
కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండవద్దని సూచించారు.
మత్స్యకారులకు హెచ్చరికలు
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సముద్రంలో పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా మత్స్యకారులు సంయమనం పాటించాలని సూచించింది.
వర్షాలతో రైతులకు కొంత ఉపశమనం
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పంటల సాగుపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సెప్టెంబర్లోనూ తగినంత వర్షపాతం నమోదుకాకపోతే కరువు పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిస్తే రైతులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.


