- 2026–27 కేంద్ర బడ్జెట్ను మాఘ పౌర్ణమి రోజున నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు
- టెక్నాలజీ, ఆరోగ్యం, పరిశ్రమలకు భారీ కేటాయింపులు ప్రకటించారు
- సెమీకండక్టర్, ఫార్మా, ఖనిజ రంగాలకు వేల కోట్ల నిధులు కేటాయించారు
పవిత్ర మాఘ పౌర్ణమి పర్వదినాన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 7 శాతం వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
పవిత్ర మాఘ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు.
నేటి నుంచి సిగరెట్లు, పాన్ మసాలా ధరల మోత… ‘సిన్ గూడ్స్’పై కొత్త పన్నుల భారం
“వికసిత్ భారత్” లక్ష్యంగా రూపొందించిన ఈ బడ్జెట్లో టెక్నాలజీ, ఆరోగ్యం, పారిశ్రామిక రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారు.
దేశాన్ని గ్లోబల్ చిప్ తయారీ కేంద్రంగా మార్చే దిశగా సెమీకండక్టర్ మిషన్ రెండో దశను ప్రకటిస్తూ రూ.40,000 కోట్ల భారీ కేటాయింపులు చేశారు. ఏపీ సహా పలు రాష్ట్రాలకు లాభం ఈ నిర్ణయం ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే ఫార్మాస్యూటికల్ రంగంలో పరిశోధన, తయారీకి ఊతమివ్వడానికి రూ.10,000 కోట్లతో కొత్త పథకాన్ని ప్రకటించారు. దేశంలో మూడు కొత్త బయోఫార్మా సంస్థలను స్థాపించడంతో పాటు, ఇప్పటికే ఉన్న ఏడు సంస్థలను విస్తరించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో కీలక ఖనిజాల వెలికితీత కోసం ప్రత్యేక ప్రణాళికను మంత్రి ప్రకటించారు. అదనంగా దేశవ్యాప్తంగా మూడు కొత్త రసాయన పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జౌళి రంగం ఆధునీకరణ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
బడ్జెట్కు మూడు ప్రధాన సూత్రాలు
ఈ ఏడాది బడ్జెట్ను మూడు ప్రధాన కర్తవ్యాల ఆధారంగా రూపొందించినట్లు నిర్మలా సీతారామన్ వివరించారు:
సమ్మిళిత ఆర్థిక వృద్ధి – అభివృద్ధి ఫలాలు ప్రతి వర్గానికీ అందేలా చేయడం
వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం – సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరినీ భాగస్వాములను చేయడం
సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ – సంస్కరణలతో కూడిన సమగ్ర అభివృద్ధి
ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ సాధించిందని, జనవరి నెలలో రూ.1.93 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు రావడం ఆర్థిక వ్యవస్థ బలాన్ని సూచిస్తోందని మంత్రి తెలిపారు.
ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, దేశం ఎగుమతులపై ఆధారపడటం తగ్గిస్తూ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.