BJP | జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయ సభ వ్యవహారంపై రాజకీయాలు వేడెక్కాయి. సభపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు పవన్కు బహిరంగ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో గురువారం మీడియాతో మాట్లాడిన రామచందర్ రావు.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ పార్టీకి అయినా ప్రజల మధ్య సమావేశాలు నిర్వహించే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో జనసేన సభ నిర్వహించాలనుకుంటే ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు.
Read Also : జెన్ జీ అభిప్రాయాలను వెల్లడించేందుకు ‘సేనా గళం’.. ప్రకటించిన పవన్ కల్యాణ్
ఎందుకు అసహనం..?
పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఎవరి పట్లా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్న ఆయన, అలాంటి నాయకుడు తెలంగాణలో సభ పెట్టాలని భావిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అసహనం ఎందుకని నిలదీశారు. జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పార్టీ అని, పవన్పై బీజేపీకి ప్రత్యేక గౌరవం ఉందని చెప్పారు. అంతేకాదు, పవన్ సభ ప్రతిపాదనతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఆందోళన నెలకొందని రామచందర్ రావు వ్యాఖ్యానించారు. ప్రజల్లో తమ ప్రభావం తగ్గిపోతుండటంతో ఈ రెండు పార్టీలు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తమ రాజకీయ ఉనికిని నిలబెట్టుకునేందుకే ప్రాంతీయ భావోద్వేగాలను ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు.
Read Also : తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకోం.. ఆంధ్రా నేతలకు కవిత వార్నింగ్
బీఆర్ఎస్పై విమర్శలు..
ఈ సందర్భంగా బీఆర్ఎస్పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన శక్తులతో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఇతర పార్టీలను ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యానించారు. ఇటీవల పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో జనసేన కార్యకలాపాలను విస్తరించే సంకేతాలు ఇవ్వడంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాజకీయాల్లో బయటి రాష్ట్ర నాయకుల జోక్యం అవసరం లేదని అభిప్రాయపడుతుండగా, బీఆర్ఎస్ నాయకత్వం కూడా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రస్తావిస్తూ పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతోంది.
Read Also : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది.. స్పష్టం చేసిన పవన్ కల్యాణ్
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
అయితే, తెలంగాణ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, రాజకీయ పార్టీలు ప్రజల ముందుకు వెళ్లడాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రామచందర్ రావు స్పష్టం చేశారు. పవన్ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న విమర్శలు అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణలో జనసేనతో భవిష్యత్ రాజకీయ పొత్తుల అంశంపై స్పందించిన రామచందర్ రావు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. జనసేనతో పొత్తు కొనసాగింపు లేదా విస్తరణపై తుది నిర్ణయం పార్టీ జాతీయ నాయకత్వం తీసుకుంటుందని వెల్లడించారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో రాజకీయంగా మరింత చురుకుగా వ్యవహరించనున్నారన్న సంకేతాల మధ్య, ఆయన సభ చుట్టూ నెలకొన్న వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. బీజేపీ మద్దతు, కాంగ్రెస్-బీఆర్ఎస్ విమర్శలతో ఈ అంశం రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం కనిపిస్తోంది.
Read Also : ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలి.. మహానాడు వేదికగా డిమాండ్ చేసిన చంద్రబాబు..


